Header Banner

దిల్ రాజు వివరణ..! అదే సమయంలో బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ వైరల్!

  Mon May 26, 2025 17:48        Cinemas

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్య సమస్యలు, బంద్ ప్రకటనల నేపథ్యంలో నెలకొన్న గందరగోళంపై ప్రముఖ నిర్మాతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తనకు తెలంగాణలో కేవలం ఒకే ఒక్క థియేటర్, ఆంధ్రప్రదేశ్‌లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. పరిశ్రమలో 'ఆ నలుగురు' అంటూ జరుగుతున్న ప్రచారంలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే, తాజాగా మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా మీడియా ముందుకు వచ్చి తన వంతు వివరణ ఇచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ, తెలంగాణలో తనకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మొత్తం 370 థియేటర్లలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు వర్గం ఆధీనంలో కేవలం 120 థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేంత దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం థియేటర్ల వివాదం సద్దుమణిగిందని, ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అయితే, దిల్ రాజు మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే మరో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం" అంటూ బండ్ల గణేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న తరుణంలో ఈ ట్వీట్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలు దిల్ రాజును ఉద్దేశించే కావొచ్చని పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!


కేంద్రం వాహనదారులకు శుభవార్త! జాతీయ రహదారులపై టోల్ కొత్త పథకం!


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #DilRaju #BandlaGanesh #ViralTweet #TollywoodBuzz #MovieNews #TollywoodUpdates #FilmIndustry